విమానాశ్రయం నుంచి వేదిక వరకు ట్రంప్‌కు స్వాగతం పలకడానికి తరలివచ్చిన లక్షలాది మంది.. వీడియోలు ఇవిగో

  • కాసేపట్లో విమానాశ్రయానికి ట్రంప్‌
  • ఘన స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం
  • రోడ్‌షోలో పాల్గొననున్న ట్రంప్ కుటుంబం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కాసేపట్లో భారత్‌లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 'నమస్తే ట్రంప్‌' వేదిక వరకు లక్షలాది మంది కళాకారులు, ప్రజలు రోడ్డుకి ఇరు వైపులా నిలబడ్డారు.

ట్రంప్‌ రాక కోసం వారు ఎదురుచూస్తున్నారు. మరోవైపు మొతెరా స్టేడియం వద్ద కళాకారులు ఆటపాటలతో ప్రజలను అలరిస్తున్నారు. విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలుకుతారు. ఎయిర్‌‌పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆహ్వాన వేడుకల్లో పాల్గొని, అనంతరం అక్కడి నుంచి అహ్మదాబాద్‌లోని మొతేరా క్రికెట్ స్టేడియం వరకు జరిగే రోడ్‌ షోలో పాల్గొంటారు.

Donald Trump
america
India

More Telugu News